జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసిన డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీదే గెలుపు చంద్రబాబు పాలనే తమకు కావాలని ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారని చెప్పారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్ధానాలను చంద్రబాబు అమలు చేస్తుంటే.. వైకాపా నాయకుడు స్వార్థం కోసం బిజెపితో కుమ్మక్కై రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేశారన్నారు. వైయస్ జగన్ ఇస్తున్న వాగ్దానాలకు ఏపీ బడ్జెట్ కూడా సరిపోదని, హామీలిస్తూ అడ్డదారిలో అధికారంలోకి వస్తానంటే ప్రజలు హర్షించరన్నారు. నిరుద్యోగభృతి వంటివి కేవలం టీడీపీ ప్రభుత్వ హయాంలోనే అమలు చేస్తున్నామన్నారు.