చెన్నై : మెరీనాబీచ్లో అంత్యక్రియలపై కోర్టు తీర్పు ప్రజావిజయమని డీఎంకే నేత స్టాలిన్ అన్నారు. రాజాజీ హాల్ వద్ద అభిమానులనుద్దేశించి స్టాలిన్ మాట్లాడారు. అభిమానులు సంయమనం పాటించాలని కోరుతున్నానన్నారు. సీఎం పళనిస్వామి నిర్ణయం అందర్నీ నిరాశపరిచిందన్నారు. అంతిమయాత్ర సజావుగా సాగేలా సహకరించాలన్నారు. అంత్యక్రియల విషయంలో వివాదం సృష్టించాలని చూశారన్నారు. భద్రత ఎందుకు తొలగించాల్సి వచ్చిందో సీఎం చెప్పాలన్నారు.