న్యూఢిల్లీ : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి జేడీయూ ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్ నామినేషన్ దాఖలు చేశారు. ఎన్డీఏ అభ్యర్థిగా హరివంశ్ బరిలో దిగారు. హరివంశ్ అభ్యర్థిత్వాన్ని ఏకగ్రీవం చేసేందుకు కాంగ్రెస్ సహా ఇతర పక్షాలతో కేంద్రమంత్రి అనంత్కుమార్ చర్చలు జరుపుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్ల దాఖలు సమయం ముగిసిపోయింది. ఈ నెల 9న ఉదయం 11 గంటలకు డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరగనుంది.