పాట్నా : ముజఫర్పూర్లోని షెల్టర్హోంలో బాలికలపై అత్యాచారం జరిగిన ఘటన దురదృష్టకరమైన సంఘటన అని బీహార్ సిఎం నితీశ్ కుమార్ అన్నారు. ఈ కేసు విచారణను సిబిఐకి అప్పగించామని ఆయన చెప్పారు. హైకోర్టు పర్యవేక్షణలో సిబిఐ విచారణ జరుపుతోందని ఆయన చెప్పారు. ఈ కేసును ప్రత్యేక బెంచ్ విచారణ జరుపుతోందని ఆయన అన్నారు. నిందితులెవరైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. షెల్టర్ హోంలో భద్రత పటిష్టం చేస్తామన్నారు.