ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొసళ్లు ఎదురొచ్చినా... భయపడకుండా బోటు ప్రయాణం

national |  Suryaa Desk  | Published : Fri, Jun 02, 2023, 09:20 PM

మొసలి నీళ్లలో ఉంటే దాని శక్తి ఏ పాటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అలాంటి మొసళ్ల మధ్య బోటు ప్రయాణం ఓసాహసం.  ఇదిలావుంటే అదొక పెద్ద చెరువు. అందులో వందలాది మొసళ్లు. వాటి మధ్య ఓ బోటు వేగంగా ప్రయాణిస్తోంది. మొసళ్లను తొక్కుకుంటూ, తోసుకుంటూ ఆ బోటు ముందుకు సాగిపోతున్న వీడియో ఒకటి ఆన్ లైన్ లో వైరల్ అవుతోంది. ఊడ్లి టెరిఫైయింగ్ పేరుతో ఉన్న ట్విట్టర్ యూజర్ ఇందుకు సంబంధించి వీడియోని షేర్ చేశారు. 


ఓ వ్యక్తి బోటుతో చెరువులోకి రాగా, అక్కడ భారీ సంఖ్యలో మొసళ్లు కనిపిస్తున్నాయి. వాటిని చూసి బోట్ లోని వ్యక్తి ఏ మాత్రం భయపడిపోకుండా ముందుకే నడిపించాడు. ఆ బోటు రావడాన్ని చూసి మొసళ్లు దాడి చేయలేదు. బదులుగా అవి భయంతో అటూ, ఇటూ పరుగులు తీశాయి. రెండు రోజుల్లోనే ఈ వీడియోని 26 లక్షల మంది చూసేశారు. ఎంతో మంది లైక్ చేస్తూ, కామెంట్లు కూడా పోస్ట్ చేస్తున్నారు. ఓ యూజర్ తనకు మిలియన్ డాలర్లు ఇచ్చి వీటి మధ్య రైడ్ చేయాలని కోరినా చేయనని తేల్చి చెప్పాడు. ఇలా చాలా మంది నో అనే చెప్పడం గమనార్హం.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com