డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధించారంటూ భారత మహిళా రెజ్లర్లు కొంతకాలంగా నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మౌనంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఆ పార్టీకి చెందిన మహారాష్ట్ర ఎంపీ ప్రీతమ్ ముండే మహిళా ఆందోళనకారులకు మద్దతుగా నిలిచారు. ఈ కేసు విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఎంపీగా కాకుండా మహిళగా అడుగుతున్నానని తెలిపారు.