హైదరాబాద్: ఈనెల 24వ తేదీన ఆంధ్రప్రదేశ్లో బంద్ చేపడుతామని వైఎస్ఆర్సీపీ నేత వైఎస్ జగన్ అన్నారు. రాష్ర్టానికి బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేసిందని, అందుకే బంద్కు పిలుపునిస్తున్నామని ఆయన తెలిపారు. జాతీయ స్థాయిలో ఏ పార్టీకైనా మద్దతు ఇస్తామన్నారు. కాకినాడలో ఇవాళ మీడియాతో మాట్లాడిన జగన్.. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్నదే తమ ఏకైక డిమాండ్ అన్నారు.