ఢిల్లీ : ఏపీ ప్రయోజనాల కోసమే కేంద్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామని టీడీపీ ఎంపీ సుజనాచౌదరి అన్నారు. అవిశ్వాసానికి మద్దతు కూడగడుతున్న టీడీపీ ఎంపీలు ఢిల్లిdలో సీఎం కేజ్రీవాల్తో భేటీ అయ్యారు. భేటీ అనంతరం సుజనాచౌదరి మీడియాతో మాట్లాడారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు.