తిరుమలలో రెండో రోజు స్వామి వారికి జ్యేష్టాభిషేకం నిర్వహిస్తున్నారు. జ్యేష్టాభిషేకం సందర్భంగా ఇవాళ వసంతోత్సవం నిర్వహించనున్నారు. ముత్యపు కవచంలో స్వామివారు దర్శనమివ్వనున్నారు. జ్యేష్ఠాభిషేకం సందర్భంగా ఆలయంలో ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని టీటీడీ రద్దు చేసింది. స్వామివారి జ్యేష్టాభిషేకం రేపటితో ముగియనుంది. రేపు కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు.