విశాఖ: రాష్ట్రంలో ఏ డిపార్ట్మెంట్ చూసినా అవినీతే రాజ్యమేలుతోందని బీజేపీ నేత సోము వీర్రాజు విమర్శించారు. విశాఖలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వాంబే గృహాల్లో భారీ అవినీతి జరిగిందని, ఇళ్ల పేరుతో 30వేల కోట్లకు పైగా దోచుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారని విమర్శించారు. ప్రైవేటు స్కూళ్లకు దోచిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.