తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. స్వామి వారి దర్శనం కోసం మొత్తం 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. నడకదారి భక్తులకు స్వామి వారిని దర్శించుకోవడానికి మూడు గంటల సమయం పడుతుండగా, ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కలగడానికి మూడు గంటల సమయం పడుతోంది.