ఒసాకా: జపాన్లో భూకంపం సంభవించింది. ఒసాకా కేంద్రంగా 6.1 తీవ్రతతో భూకంపం నమోదైంది. ఇవాళ ఉదయం 8 గంటలకు భూ ప్రకంపన చోటుచేఉకుంది. 13 కిలోమీటర్ల లోతులో భూ ప్రకంపనలు వచ్చినట్లు మెటిరియోలాజికల్ ఏజెన్సీ పేర్కొన్నది. భూకంపం వల్ల ముగ్గురు చనిపోగా, డజన్ల సంఖ్యలో జనం గాయపడ్డారు. కేవలం ఒసాకాలోనే 40 మంది గాయపడ్డట్లు ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ తెలిపింది. భూకంప తీవ్రతకు గోడలు, కిటికీలు కూలాయి. షాపుల్లో ఉన్న వస్తువులు కిందపడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు బీటలు వారాయి. వాటర్ పైపులు పగిలిపోయాయి.