భోపాల్ : మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం ముందు పూల వ్యాపారుల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మరో వ్యక్తిని కింద పడేసి కొట్టాడు. దీంతో సదరు వ్యక్తిని అడ్డుకోబోయిన మరో ఇద్దరు మహిళలను కూడా తీవ్రంగా చితకబాదాడు. ఇరు వర్గాల మహిళలు కూడా కొట్టుకున్నారు. ఈ గొడవకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే కొట్లాట జరిగిన సమయంలో అక్కడ చాలా మంది ఉన్నప్పటికీ ఎవరూ విడిపించలేకపోయారు. అందరూ తమ సెల్ఫోన్లలో ఆ గొడవను చిత్రీకరించుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది. ఆలయం ముందు ప్రశాంత వాతావరణం కల్పించేందుకు పోలీసులు చర్యలు తీసుకోవాలని పలువురు సూచించారు.