ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళలపై ఓ వ్యక్తి వీరంగం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 18, 2018, 12:17 PM

భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం ముందు పూల వ్యాపారుల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మరో వ్యక్తిని కింద పడేసి కొట్టాడు. దీంతో సదరు వ్యక్తిని అడ్డుకోబోయిన మరో ఇద్దరు మహిళలను కూడా తీవ్రంగా చితకబాదాడు. ఇరు వర్గాల మహిళలు కూడా కొట్టుకున్నారు. ఈ గొడవకు గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే కొట్లాట జరిగిన సమయంలో అక్కడ చాలా మంది ఉన్నప్పటికీ ఎవరూ విడిపించలేకపోయారు. అందరూ తమ సెల్‌ఫోన్లలో ఆ గొడవను చిత్రీకరించుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. ఆలయం ముందు ప్రశాంత వాతావరణం కల్పించేందుకు పోలీసులు చర్యలు తీసుకోవాలని పలువురు సూచించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com