న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజ్ నివాస్ లో చేపట్టిన ఆందోళన ఆరో రోజుకు చేరింది. లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో సీఎం కేజ్రీవాల్ నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. సీఎంతో పాటు మంత్రులు సత్యేంద్ర జైన్, సిసోడియాలు కూడా ఉన్నారు. కాగా సత్యేంద్ర జైన్, సిసోడియాలు లెఫ్టినెంట్ గవర్నర్ వైఖరికి వ్యతిరేకంగా రాజ్ నివాస్ లోనే నిరశన చేపట్టారు. ఇలా ఉండగా రాజ్ నివాస్ కేంద్రంగా సీఎం కేజ్రీవాల్ ఆందోళనకు దిగడం సరికాదని ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ అన్నారు.