అమరావతి : హోంగార్డుల దినసరి వేతనాన్ని పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. హోంగార్డుల దినసరి వేతనాన్ని 300 రూపాయిలనుంచి 600 రూపాయిలకు పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు. హోంగార్డులు నేడు ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. దీనికి సానుకూలంగా స్పందించిన చంద్రబాబు వారి దినసరి వేతనాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు. అలాగే మహిళా హోంగార్డులకు మెటర్నిటీ సెలవులను 3 నెలలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అజ్మీర్ దర్గాకు ఛద్దర్ పంపనున్నారు. నేడు ప్రజాదర్బార్ హాల్లో వక్ఫ్ బోర్డు ఛైర్మన్ జలీల్ ఖాన్కు చంద్రబాబు ఛద్దర్ అందజేశారు. విజయవాడనుంచి 150 మంది ముస్లింలు అజ్మీర్ దర్గా యాత్రకు వెళ్లనున్నారు. వారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చంద్రబాబు అందజేసిన ఛద్ధర్ దర్గాలో సమర్పిస్తారు.