తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఇవాళ, రేపు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఒడిశా నుంచి కోస్తా, తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి ఏర్పడిందని, మరోవైపు ఒడిశా నుంచి కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడిందని వాతావరణ కేంద్రం పేర్కొంది. వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.