ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ నేతలకు శుభాకాంక్షలు తెలిపిన జే.పీ.నడ్డా

national |  Suryaa Desk  | Published : Wed, Mar 29, 2023, 09:07 PM

టీడీపీ ఎంపీలకు  బీజేపీ జాతీయ రథ సారథి  జే.పీనడ్డా  శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలావుంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. పార్లమెంటులోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఎన్టీఆర్ కు నివాళి అర్పించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని, కనకమేడల రవీందర్, తదితరులు పాల్గొన్నారు. ఇతర పార్టీల ఎంపీలు కూడా టీడీపీ నేతలో కలిశారు. 


ఇదే సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అక్కడకు చేరుకున్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీడీపీ ఎంపీలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వాజ్ పేయి హయాంలో టీడీపీ, బీజేపీ పార్టీల మధ్య అనుబంధాన్ని నడ్డాకు తెలుగుదేశం ఎంపీలు వివరించారు. టీడీపీతో బీజేపీకి ఉన్న సంబంధాలు తనకు తెలుసని చెప్పారు. ఇటీవల అండమాన్ మేయర్ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలు పొత్తు పెట్టుకుని గెలిచాయి. ఈ సందర్బంగా టీడీపీ అభ్యర్థికి నడ్డా ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com