ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రపంచ ఫొటోగ్రఫీ అవార్డు తీసుకున్నా విజయవాడ యువతి...

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 04, 2017, 08:52 AM

సూర్య ,అమరావతి: విజయవాడకు చెందిన లక్ష్మీశ్రావ్య కాగొలను(26).. సోనీ సంస్థ ఆధ్వర్యంలోని ప్రపంచ ఫొటోగ్రఫీ సంస్థ ఏటా నిర్వహించే పోటీలో విద్యార్థి విభాగంలో విజేతగా నిలిచింది. భారతదేశం నుంచి ఇప్పటివరకూ విద్యార్థి విభాగంలో ఎంపికైన ఏకైక యువతి శ్రావ్యే కావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా 500 విద్యాసంస్థల నుంచి యువత పోటీలో పాల్గొన్నారు. దీనిలో ఒక్కో ఖండం నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేసింది. న్యూయార్క్‌లోని స్కూల్‌ ఆఫ్‌ విజువల్‌ ఆర్ట్‌లో మాస్టర్స్‌ ఇన్‌ డిజిటల్‌ ఫొటోగ్రఫీ కోర్సు చేస్తున్న శ్రావ్య ఉత్తరఅమెరికాఖండం నుంచి ఎంపికైంది. విజయవాడకు చెందిన సురేష్‌ కాగొలను, శ్యామల దంపతుల కుమార్తె శ్రావ్య నగరంలోని కె.ఎల్‌.యూలో 2012లో ఇంజినీరింగ్‌ పూర్తిచేసింది. రెండేళ్ల కిందట డిజిటల్‌ ఫొటోగ్రఫీ కోసం న్యూయార్క్‌కు వెళ్లింది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com