అమరావతి: నీరు-ప్రగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలీకాన్ఫరెన్స్లో కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ ఒక్క నెలలోనే రూ.928 కోట్ల విలువైన నరేగా పనులు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నిధుల కోసం కేంద్రంపై పోరాడుతూనే ఉన్న పథకాలను సద్వినియోగం చేసుకుంటున్నామన్నారు.