తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం వేచిచూస్తున్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లూ నిండిపోయాయి. శ్రీవారి సర్వదర్శనానికి 25 గంటల సమయం పడుతోంది. కాలినడక భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి నాలుగు గంటల సమయం పడుతోంది. అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు కూడా స్వామి వారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది.