స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం 50 పాయింట్లకు పైగా లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్... ఆ తర్వాత ఒకానొక దశలో 120 పాయింట్ల వరకు పెరిగింది. అయితే, చివర్లో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ చేయడంతో లాభాలు తగ్గిపోయాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 30 పాయింట్ల లాభంతో 34,651కు చేరింది. నిఫ్టీ 20 పాయింట్లు లాభపడి 10,537 వద్ద స్థిరపడింది.