బెంగళూరు: కర్ణాటక సీఎంగా మరికాసేపట్లో యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో రాజ్భవన్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. రాజ్భవన్ ముందు కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలకు దిగే అవకాశం ఉన్నందున రాజ్భవన్ పరిసర ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. భద్రత చర్యల్లో భాగంగా రాజ్భవన్కు వచ్చే దారులన్నీ మూసివేశారు.