హైదరాబాద్ : చంద్రబాబు నాయుడి చిల్లర రాజకీయాలను ప్రజలు తిరస్కరించారంటూ బీజేపీ నాయకుడు రామ్ మాధవ్ చేసిన ట్వీట్ పై తెలుగుదేశం ప్రతినిథి బాబూ రాజేంద్రప్రసాద్ మండి పడ్డారు. ఆ పార్టీ అధికార దురహంకారానికి రామ్ మాధవ్ వ్యాఖ్యలు నిదర్శనమని విమర్శించారు. అధికారం, డబ్బు, గాలి వంటి మైనింగ్ మాఫియా అండతో కర్నాటకలో బీజేపీ విజయం సాధించిందని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.