కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ చేరుకుంది. కర్ణాటక అసెంబ్లి ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం అధికారి నియోజకవర్గాల వారీగా ప్రకటిస్తున్నారు. కుందాపురలో బీజేపీ అభ్యర్థి హాలాడి శ్రీనివాసశెట్టి విజయం సాధించారు. అలాగే ఉడుపి జిల్లా కాపు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి లాలాజీ ఆర్.మెండన్ గెలుపొందారు. మూడబిద్రిలో బీజేపీ అభ్యర్థి ఉమానాథ్ విజయం సాధించారు. తీర్థహళ్లిలో బీజేపీ అభ్యర్థి అరగ జ్ఞానేంద్ర గెలుపొందారు.