పశ్చిమగోదావరి జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి 162వ రోజు ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభమైంది. జగన్ తన 162వ రోజు పాదయాత్రను ఏలూరు శివారు నుంచి ప్రారంభించారు. పాదయాత్ర మల్కాపురం, పాలెగూడెం, కొవ్వలి మీదుగా దెందులూరు వరకు కొనసాగనుంది. పాదయాత్రలో భాగంగా దెందులూరు గ్రామంలో జగన్ రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు.