ముఖ్యమంత్రి చంద్రబాబుపై సోమువీర్రాజు చేసిన వ్యాఖ్యలకు మంత్రి గంటా శ్రీనివాసరావు కౌంటర్ ఇచ్చారు. మోదీ, అమిత్ షానే ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలిపిరి ఘటనను చంద్రబాబు కూడా ఖండించారన్నారు. ఘటన పథకం ప్రకారం జరిగింది కాదని వెల్లడించారు. అలిపిరి ఘటన ప్రజల్లో ఉన్న ఆవేదన తెలియజేస్తోందని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.