ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మున్సిపల్ కార్మికులకు పనిముట్లు పంపిణీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 01, 2023, 07:40 PM

ధర్మవరం పట్టణంలోని రాంనగర్ కు చెందిన మాజీ ఆర్మీ అధికారి టి. సతీష్ పురపాలక సంఘ కార్యాలయంలోని కమిషనర్ మల్లికార్జున కు 25 వేల రూపాయలు విలువచేసే యంత్ర పనిముట్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులకు ఈ పనిముట్లు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, ఉద్యోగులు దాతకు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీరింగ్ ఉద్యోగులు ఈ ఈ. సత్యనారాయణ, డి ఈ. వన్నూరప్ప, ఏఈలు హరీష్ ప్రతాప్ లు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com