స్వయం ప్రకటిత గురువు ఆశారాం బాపుపై అత్యాచారం కేసులో జోధ్ పూర్ ట్రయల్ కోర్టు రేపు తీర్పు ఇవ్వనున్నది. ఈ నేపథ్యంలో జోధ్ పూర్ లో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రాజస్థాన్ హైకోర్టు ఆదేశాల మేరకు జోథ్ పూర్ ట్రయల్ కోర్టు తన తీర్పును జోథ్ పూర్ సెంట్రల్ జైలు ప్రాంగణలో వెలువరిస్తుంది. తీర్పు సందర్భంగా ఆశారాం బాపూ అనుచరులు విధ్వంసానికి పాల్పడే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ నివేదికల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా జోథ్ పూర్ లో నిషేధాజ్ణలు విధించారు.