ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోపవరపుగూడెం శివారు నుంచి ప్రారంభమైన జగన్‌ పాదయాత్ర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 24, 2018, 09:14 AM

కృష్ణా జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి 144వ రోజు పాదయాత్ర ప్రారంభమైంది. జగన్‌ తన 144వ రోజు పాదయాత్రను గోపవరపుగూడెం శివారు నుంచి ప్రారంభించారు. పాదయాత్ర కొండపావులూరు, పురుషోత్తపట్నం, వెంకటనరసింహపురం కాలనీ, గన్నవరం మీదుగా దావాజీగూడెం వరకు కొనసాగనుంది. పాదయాత్రలో భాగంగా గన్నవరం మూడు బొమ్మల సెంటర్‌లో జరిగే బహిరంగ సభలో జగన్‌ పాల్గొని ప్రసంగించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com