నగదు లావాదేవీలపై బ్యాంకుల నుంచి రుసుములు వసూలు మొదలయింది. నెలకు నాలుగు వరకు ఉచిత లావాదేవీలను అనుమతిస్తున్న హెచ్డీఎప్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ తదితర బ్యాంకులు నగదు ఉపసంహరణ లేదా నగదు డిపాజిట్లు ఆ పరిమితికి మించితే ఒక్కో లావాదేవిపై బుధవారం నుంచి రుసుముగా కనీసం రూ.150 వసూలు చేస్తున్నాయి. నగదు స్వీకరించే యంత్రంలో నెలలో తొలి జమకు రుసుము ఉండదు. ఆ తరువాత నుంచి వెయ్యిక రూ.5 లు వసూలు చేస్తారు. యాక్సిస్ బ్యాంకులో తొలి ఐదు లావాదేవీలు లేదా రూ.10 లక్షల నగదు డిపాజిట్లు లేదా ఉపసంహరణలకు రుసుము ఉండదు. ఆ తరువాత రూ.150 లేదా వెయ్యికి రూ.5 ఏది ఎక్కువయితే ఆ మొత్తం రుసుముగా వసూలు చేస్తారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు కూడా రుసుములు వసూలు చేస్తున్నాయా లేదా అన్నదానిపై అధికారిక సమాచారం లేదు.