ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జాతీయ రహదారుల పక్కన వైన్ షాపులు మాత్రమే నిషేధం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 02, 2017, 12:17 PM

జాతీయ రహదారులకు 500 మీటర్ల దూరం వరకూ మద్యం అమ్మకాల నిషేధం కేవలం వైన్ షాపులకు మాత్రమే వర్తిస్తుందని, బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్బులకు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసినట్టు అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి వెల్లడించారు. ఈ మేరకు కేరళ ప్రభుత్వానికి ఆయన సమాచారం ఇచ్చారు. ఏప్రిల్ ఒకటి నాటికి హైవేలపై ఉన్న మద్యం షాపులను తొలగించాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించిన తరువాత, కేరళ ప్రభుత్వం, తమ ఆదాయం దెబ్బతింటోందని చెబుతూ, ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో సుప్రీం రూలింగ్ మద్యం షాపులకు మాత్రమే వర్తిస్తుందని, బార్లకు కాదని అటార్నీ జనరల్ వివరణ ఇచ్చారు. ఈ విషయంలో గతంలో ఇచ్చిన సుప్రీం తీర్పు స్పష్టంగా ఉందని ఆయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com