పులివెందుల : కడప జిల్లాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందులలో వైసీపీ నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇద్దరు సీనియర్ వైసీపీ నాయకులు టీడీపీలో చేరారు. పులివెందులలోని బలపనూరుకు చెందిన శ్రీనాథ్ రెడ్డి, నారాయణరెడ్డి సోదరులు రాజశేఖర్రెడ్డి కాలం నుంచి వైఎస్ కుటుంబానికి ఎంతో సన్నిహితంగా ఉన్నారు. అయితే పార్టీ విధానాలు, నిర్ణయాలతో విసుగెత్తిన ఆ రెడ్డి బ్రదర్స్ ఇప్పుడు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ నేతలు బీటెక్ రవి, సతీష్ రెడ్డిలు శ్రీనాథ్ రెడ్డి, నారాయణరెడ్డిలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.