బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్షా నేడు బెంగళూరులో రెండవ రోజు పర్యటన సాగిస్తున్నారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో అనుబంధ విభాగాలతో, ఎన్నికలు, ప్రచార సామాజిక మాధ్యమాల విభాగాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై అమిత్షా పార్టీ ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. పార్టీకి చెందిన క్షేత్ర స్థాయి ప్రతినిధులతో, గుజరాతీ వ్యాపార వర్గాలతో ఆయన సమావేశం కానున్నారు.