విజయనగరం జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ నాగేశ్వరరావు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాగేశ్వరరావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని అభియోగాలు రావడంతో నాగేశ్వరరావు ఆస్తులపై నిన్న ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. సోదాలు పూర్తయి దాదాపు రూ.20కోట్లకు పైగా అక్రమాస్తులున్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. నాగేశ్వరరావును ఇవాళ అధికారులు విశాఖ ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నారు. నాగేశ్వరరావు ఇళ్లలో తనిఖీలు నిర్వహించిన ఏసీబీ అధికారులు ఏడు చోట్ల ఇళ్ల స్థలాలు, మూడు ఫ్లాట్లు, రెండు ఇళ్లు,12 ఎకరాల భూమి, 705 గ్రాముల బంగారం, ఐదున్నర కేజీల వెండి, 20 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు రూ.13లక్షలు ఉన్నట్లు గుర్తించారు.