కృష్ణ జింకల వేట కేసులో అయిదేళ్లు జైలు శిక్ష పడ్డ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్కు 50 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు అయిన సంగతి తెలిసిందే. 1998లో వచ్చిన ‘హమ్ సాథ్ సాథ్ హై’ చిత్రీకరణ సమయంలో సల్మాన్ కృష్ణజింకను వేటాడినట్టు ఆరోపణలు రాగా, జోద్పూర్ కోర్టు సల్మాన్ని దోషిగా తేల్చింది. రెండు రోజులు జైలు జీవితం గడిపిన తర్వాత బెయిల్తో సల్మాన్ బయటకి వచ్చాడు. అయితే జోధ్పూర్ కోర్టు తాజా తీర్పు సల్మాన్కి కాస్త ఊరట కలిగించింది. నాలుగు దేశాలలో ఆయన విజిట్ చేసే అవకాశం కలిపించింది. సల్మాన్ బెయిల్పై బయటకి వచ్చినందున అతను మనదేశం దాటి బయటకి వెళ్లకూడదనే నిబంధన ఉంది. కాని సల్మాన్ చేయబోవు పలు చిత్రాలు విదేశాలలో చిత్రీకరణ జరుపుకోవలసి ఉన్న నేపథ్యంలో ఈయన కోర్టుకి తన విన్నపాన్ని తెలియజేశాడు. ఈ క్రమంలో జోద్పూర్ కోర్టు కేవలం నాలుగు దేశాలకి మాత్రమే పర్మీషన్ ఇచ్చింది. మే 25 నుండి జులై 10 వరకు సల్మాన్ ఖాన్ కెనడా, నేపాల్ , యూఎస్ఏ లలో పర్యటిచనున్నాడు. సల్మాన్ తాజా చిత్రం రేస్ 3 రెమా డిసౌజా దర్శకత్వంలో తెరకెక్కుతుండగా, ఈ మూవీకి సంబంధించి ఒక్క సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. దీనిని విదేశాలలో చిత్రీకరించనున్నారు. ఈద్ కానుకగా మూవీ విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత సల్మాన్ భరత్, దబాంగ్ 3, కిక్ చిత్రాలు చేయనున్నాడు.