ముంబై: జీఎస్టీతో పాటు సర్వీస్ ట్యాక్స్ను ఎగవేసిన వారిపై కేంద్రం చర్యలు తీసుకుంటున్నది. ఆన్లైన్ షాపింగ్ నిర్వహిస్తున్న గ్యాడ్జెట్స్ గురు వెబ్సైట్ డైరక్టర్ రాజ్పాల్ సింగ్ను పన్ను అధికారులు అరెస్టు చేశారు. నవీ ముంబైలో ఉన్న గ్యాడ్జెట్స్ గురు ఆఫీసును పోలీసులు సీజ్ చేశారు. ఆ ఆన్లైన్ షాపింగ్ సైట్ మొత్తం 8 కోట్ల మేరకు జీఎస్టీ ఎగవేసిందని అధికారులు చెబుతున్నారు.