న్యూఢిల్లి : పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద యుపిఎ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పలువురు ఎంపిలు నిరసన దీక్ష చేపట్టారు. బ్యాంకు కుంభకోణం, రైతుల సమస్యలు, అవిశ్వాస తీర్మానం, ఎస్ఎసి ఎస్టి చట్టం, ఎయిర్ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణ తదితర సమస్యలపై సభలో చర్చించాలంటూ వారు డిమాండ్ చేశారు.