అమరావతి: సీఎం చంద్రబాబు అఖిలపక్ష భేటీ మూడేళ్ల క్రితం పెట్టాల్సిందని వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈరోజిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం మూడేళ్ల తర్వాత స్పందించారని విమర్శించారు. నాయకత్వం వహించాల్సిన సీఎం విఫలమయ్యారన్నారు. అఖిలపక్షం నిర్వహించే అర్హత టీడీపీ ప్రభుత్వానికి లేదని అన్నారు. హోదా తీసుకురావడంలో చంద్రబాబు విఫలమయ్యారు కాబట్టే ఆ బాధ్యతను జగన్ తీసుకున్నారని పేర్కొన్నారు.