అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో చంద్రబాబు మాట్లాడుతూ.. కేంద్రంపై మనం కూడా ఎదురుదాడికి దిగాలని అన్నారు. తాను 40 ఏళ్ల రాజకీయ అనుభం ఉన్న నాయకుడినన్నారు. వాళ్లకంటే ముందుగా తాను సీఎం అయ్యానని గుర్తు చేయండని ఎంపీలకు సూచించారు. గతంలోనే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పానని పేర్కొన్నారు.