గుంటూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి 121వ రోజు ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభమైంది. జగన్ తన 121వ రోజు పాదయాత్రను ముప్పాళ్ల శివారు నుంచి ప్రారంభించారు. పాదయాత్ర నార్నెపాడు క్రాస్, దమ్మాలపాడు క్రాస్, మాదల, ఇరుకుపాలెం మీదుగా సత్తెనపల్లి వరకు కొనసాగనుంది. పాదయాత్రలో భాగంగా జగన్ సాయంత్రం సత్తెనపల్లిలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.