అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని 1183 చెరువులకు నీళ్లు ఇస్తామని నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ అన్నారు. అసెంబ్లిdలో ఆయన మాట్లాడుతూ… జలజగడాలు రాకుండా చూడాలన్న సభ్యుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుంటామన్నారు. భైరవానితిప్ప, పేరూరు ప్రాజెక్టులను వచ్చే సంక్రాంతికి పూర్తి చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పేరూరు ప్రాజెక్టు ఈవారంలోనే టెండర్లు పిలుస్తున్నామని పేర్కొన్నారు.