తిరుపతి: ఎపి హక్కుల కోసం అంతా కలిసికట్టుగా పనిచేయాలని ఎంపిలకు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఆగస్టు సంక్షోభంలో 161 మంది ఎమ్మెల్యేలు ఒకేతాటిపైకి వచ్చి విజయం సాధించారన్నారు. చివరి రోజు వరకు ఈ స్ఫూర్తి కొనసాగాలని తిరుపతి నుంచి టెలికాన్ఫరెన్స్లో చెప్పారు. కొంతకాలంగా టిడిపిపై బిజెపి అనుమానాలు పెంచుకుందన్న బాబు.. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశం లేదన్నారు. ఎపి అంశం ఇప్పుడు జాతీయ సమస్యగా మారిందన్నారు. వైసిపిది లాలూచీ అవిశ్వాసమన్నారు.