ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీ-20 శోభతో ఆలయం కిటకిట

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 05, 2022, 10:59 AM

జీ-20 శోభతో లేపాక్షి ఆలయం విద్యుత్ దీపాలంకరణతో కళకళలాడుతోంది. దీంతో పర్యాటకులు ఆలయానికి పోటెత్తుతున్నారు. ఆలయంలోని దుర్గా, వీరభద్రస్వాములను ఆలయ అర్చకులు ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తున్నారు. ఆంధ్ర, కర్నాటక తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తున్నారు. ఆదివారం లేపాక్షి వీరభద్రాలయం, ఏకశిలానంది విగ్రహం, జరాయువు క్షి పర్యాటకులతో కిటకిటలాడింది. ఆలయంలో భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేసి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com