అమరావతి : కేసుల మాఫీ కోసం వైకాపా అధినేత జగన్ అప్పుడు కాంగ్రెస్ తో లాలూచీ పడ్డారని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన అదే కారణంతో ఇప్పుడు బీజేపీతో లాలూచీ పడుతున్నారని జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ వ్యవహారశైలి, వైఖరిని ప్రజలు అర్ధం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. తెలుగుదేశం అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వగానే జాతీయ స్థాయిలో పలు పార్టీలు ముందుకొచ్చి మద్దతు తెలిపాయనీ ఆయన చెప్పారు.