అమరావతి : కేంద్రానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టి జాతీయ పార్టీల మద్దతు కోరుతుంటే…తాను జాతీయ రాజకీయాలలోకి వస్తున్నాననీ, ఇక రాష్ట్రాన్ని పట్టించుకోనంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే అవిశ్వాస తీర్మానం పెట్టామనీ, అందుకోసమే జాతీయ పార్టీల మద్దతు కోరుతున్నామని స్సష్టం చేశారు. అన్ని జాతీయ పార్టీల నాయకులతోనూ మాట్లాడి అవిశ్వాసానికి మద్దతు కూడగట్టాలని ఆయన ఎంపీలను ఆదేశించారు. సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై వారికి దిశా నిర్దేశం చేశారు.