విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఆదివారం ఇంఫాల్లోని ఇమా మార్కెట్ను సందర్శించారు. నవంబర్ 26-28 మధ్య జైశంకర్ మణిపూర్ పర్యటనలో ఉన్నారు. ఈమేరకు శనివారం డాక్టర్ ఎస్ జైశంకర్ మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రాల్లో కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మణిపూర్ రాజధాని ఇంఫాల్ పర్యటనలో ఉన్న జైశంకర్ శనివారం సాయంత్రం నగరంలోని క్లాసిక్ గ్రాండేలో జరిగిన ఇంటరాక్టివ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.