అస్సాంలోని చరైడియా జిల్లాలోని 2 పాఠశాలలకు చెందిన మొత్తం 50 మంది విద్యార్థులు ఐరన్ ఫోలిక్ మాత్రలు వేసుకుని అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఆరోగ్య సిబ్బంది అందించిన మాత్రలు వేసుకుని విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. వారిని సోనారీ సివిల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అనంతరం డిశ్చార్జి చేశారు. అయితే ఉపాధ్యాయుల సమక్షంలోనే మాత్రలు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. వీటిని పిల్లలు ఖాళీ కడుపుతో తీసుకోకూడదని అధికారులు తెలిపారు.