హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జింద్ జిల్లాలోని రోహ్ తక్ జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్ ప్రాణాలు కోల్పోగా, 50 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో పిల్లలు కూడా ఉన్నారు. పరిస్థితి విషమంగా ఉన్న 20 మందిని స్థానిక ఆరోగ్య కేంద్రం నుండి జనరల్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.