న్యూఢిల్లి : రాజ్యసభలో విపక్ష సభ్యులు గందరగోళం సృష్టించారు. దీనితో సభను వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. సభ తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు సమావేశమవుతుంది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం ఎపి ఎంపిలతో సహా వివిధ రాష్ట్రాలకు చెందిన విపక్ష పార్టీల ఎంపిలు పలు అంశాలపై గందరగోళం సృష్టించారు.