గుంటూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ 111వ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభమైంది. జగన్ తన 111వ రోజు పాదయాత్రను బాపట్ల శివారు నుంచి ప్రారంభించారు. పాదయాత్ర మూర్తి రక్షణనగరం, కొండుబొట్లవారిపాలెం క్రాస్, అప్పికట్ల, పూండ్ల క్రాస్ మీదుగా ఈతేరు వరకు కొనసాగనుంది. పాదయాత్రలో భాగంగా ఈతేరులో జగన్ జనంతో మమేకమవుతారు.